భారతదేశం, సెప్టెంబర్ 16 -- వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం (KU) దూరవిద్య ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. జూలై 2026 సెషన్ విద్యాసంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గడువు పొడిగిస్తూ ప్రకటన విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... సెప్టెంబర్ 15వ తేదీతో గడువు ముగిసింది.

అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ లేదా నేరుగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి ఉన్నవారు కాకతీయ యూనివర్సిటీ దూర విద్య అధికారిక వెబ్‌సైట్ www.sdlceku.co.in ని సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేయడం ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చని అధ...