భారతదేశం, ఏప్రిల్ 12 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయామన్నారు. 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తాము కూడా కొన్ని తప్పులు చేశామని.. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యామని చెప్పుకొచ్చారు.

మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ కారకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్ల...