భారతదేశం, సెప్టెంబర్ 4 -- Konda Surekha Social Media Post : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినాయకత్వం నిర్ణయంతో కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే.. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నట్లు పేర్కొన్నారు.

"ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను," అని కొండా సురేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన ఈ చిన్న పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత కొంతకాలంగా కొండా సురేఖ పొలిటికల్ మూవ్‌మెంట్స్‌పై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో స్వయంగా ఆమె "కీలక నిర్ణయం" అంటూ అధికారికంగా ప్రకటన...