భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొండ సురేఖపై వేటుకు లైన్ క్లియర్ అయింది. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో.. ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ (గవర్నర్ కార్యాలయం) కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖ లోక్ భవన్ కార్యాలయానికి చేరటంతో. గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారికంగా బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యవహారాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ...