భారతదేశం, సెప్టెంబర్ 3 -- మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి.. తనను పదవి నుంచి తొలగించేలా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కేబినెట్ నుంచి తీసివేయకపోతే తాను సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి దిల్లీ పెద్దలను బెదిరించారని.. దాంతో చేసేది లేక అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

నిజానికి తనను మంత్రివర్గం నుంచి తొలగించాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం లేదని, కేవలం రేవంత్ చేసిన బ్లాక్‌మెయిలింగ్ వల్లే ఈ నిర్ణయం వెలువడిందని సురేఖ స్పష్టం చేశారు. తన పదవి ఊడగొట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని.. ముఖ్యంగా కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మంత్రి ప...