భారతదేశం, జూలై 15 -- Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు నేరుగా రైలు ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌కు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 99.5 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మ...