భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విశ్వవిద్యాలయం మళ్లీ ప్రారంభించింది.

గతంలో నిర్ణయించిన గడువు ఆగస్టు 12తో ముగియగా, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విండోను పునఃప్రారంభిస్తున్నట్లు KNRUHS అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు క్రింది పట్టికలో పేర్కొన్న సమయాలను గమనించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఆగస్టు 18, మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఆగస్ట...