భారతదేశం, మార్చి 28 -- బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గతేడాది తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 జూలైలో వీరికి 'సారాయ మల్హోత్రా' జన్మించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ.. అమ్మనయ్యాక తనలో కలిగిన మార్పుల గురించి ఎంతో హృద్యంగా మాట్లాడారు.

పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లికైనా ప్రపంచం మారిపోతుంది. కియారా విషయంలోనూ అదే జరిగింది. "అమ్మనయ్యాక నాలో ఒక ఆడపులి (Tigress) మేల్కొన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నా జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది. ఒకవైపు ఏదీ ముఖ్యం కాదనిపిస్తూనే, మరోవైపు ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం అనిపిస్తోంది. నా లోపల ఆ చిన్నారి నిరంతరం ఉంటూనే ఉంది" అని కియారా అద్వానీ తన భావాలను పంచుకున్నారు.

సిద్ధార్థ్‌తో పెళ్లి తర్వాత బంధం గురించి మాట్లాడుతూ.. "పెళ్లికి ముందు మ...