భారతదేశం, సెప్టెంబర్ 6 -- దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎంపీవీ 'కార్నివాల్'లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల సోరెంటో మోడల్‌ను పరిచయం చేసిన సందర్భంలోనే, భారత్‌లోకి కార్నివాల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తున్న ఈ లగ్జరీ కారులో ఇకపై పవర్​ఫుల్ పెట్రోల్-హైబ్రిడ్ ఆప్షన్ కూడా లభించనుంది.

కొత్త కియా కార్నివాల్ హైబ్రిడ్ కారులో 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 180 హెచ్‌పీ పవర్, 265 ఎన్ఎమ్ టాప్‌ను విడుదల చేస్తుంది. అయితే సోరెంటో హైబ్రిడ్‌తో పోలిస్తే, కార్నివాల్ ఎంపీవీ పరిమాణం పెద్దది కావడంతో ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్...