భారతదేశం, ఏప్రిల్ 7 -- తమిళనాడు రాజకీయాలకు ఇప్పుడు సినీ గ్లామర్‌ తోడై హీటెక్కుతున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు సుందర్ సి ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి 'పుదియ నీది కట్చి' (PNK) అభ్యర్థిగా, AIADMK కూటమి మద్దతుతో సుందర్ సి బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయన ప్రచార పర్వం మొదలవ్వకముందే సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద వార్త చక్కర్లు కొడుతోంది.

మదురై సెంట్రల్ నియోజకవర్గంలో తాను గెలిస్తే, అక్కడ ఉన్న మాంసం దుకాణాలను పూర్తిగా నిషేధిస్తానని సుందర్ సి అన్నట్లుగా మంగళవారం (ఏప్రిల్ 7) కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రసిద్ధ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడటానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పోస్టుల సారాంశం. ఈ వార్త స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ప్రచారంపై సుందర్ సి వెంటనే స్పందించార...