భారతదేశం, ఏప్రిల్ 2 -- 2026-27 విద్యా సంవత్సరానికి గాను.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) 6 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాల ప్రాసెస్ నడుస్తోంది. అలాగే 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ) తెలిపారు.

వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1తో ముగియాల్సి ఉంది. అయితే తల్లిదండ్రుల అభ్యర్థనల మేరకు చివరి తేదీని పొడిగించినట్లు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాల కోసం కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుం...