భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఏప్రిల్ 25, 2026 మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌ వద్ద నిర్వహించిన సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా ప్రకటించారు.

అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి, పిడికిలి బిగించి కొట్లాడామని చెప్పారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు తెగుతాయని భావించాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, దళితులు దెబ్బలు తిన్నారని కవిత విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత స్వేచ్ఛ లేని నిఘా నీడలో తెలంగాణ బతికింద...