భారతదేశం, మార్చి 21 -- కరీంనగర్ టౌన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులక్రితం ఆయన భార్య దివ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఆమె దశదిన కర్మల కోసం అత్తగారింటికి వెళ్లిన చంద్రశేఖర్. ఈ దారుణానికి ఒడిగట్టాడు.

గత నాలుగు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య. గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు. సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని ఆరోపించారు. ఓ దశలో దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇవాళ ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న...