భారతదేశం, మార్చి 23 -- బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి లోక్సభ నియోజకవర్గ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం (మార్చి 23) తన పుట్టినరోజును పురస్కరించుకుని కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా మీట్ అయ్యారు. ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ భేటీ గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ.. "గౌరవనీయులైన ప్రధానమంత్రి సమయాన్ని, ఆయన అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని ఈ రోజు నా కుటుంబంతో కలిసి పొందాను. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కంగనా పంచుకున్న ఫోటోలలో ఆమె తల్లిదండ్రులు ప్రధాని ముందు వినయంగా చేతులు జోడించి కూర్చోగా, మోదీ చిరునవ్వుతో వారితో మాట్లాడుతుండటం కనిపిస్తోంది. మరో ఫోటోలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.