భారతదేశం, ఏప్రిల్ 28 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఘోష్ కమిషన్ విచారణ కూడా ముగిసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి కూడా అప్పగించింది. అయితే సీబీఐ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం సమీక్షించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. న్యాయ నిపుణుల సూచనలతో తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ.. సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

ఈ కేసులో సీబీఐ విచారణకు వీ...