భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసాగిల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జస్టిస్‌ లీసాగిల్‌ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 25న జస్టిస్‌ లీసాగిల్‌తో సీజేగా ప్రమాణం చేయిస్తారు.

రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసాగిల్‌ చరిత్రకెక్కనున్నారు. పంజాబ్‌-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ లీసాగిల్‌ను గతనెలలోనే ఏపీ హైకోర్టుకు బదిలీ అ...