భారతదేశం, మే 2 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురు బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చబోతున్నారు. 2026 జూన్ 2వ తేదీన గురువు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. ఈ అరుదైన గోచారం వల్ల ద్వాదశ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి.

వేద జ్యోతిష్యం ప్రకారం గురువు ధనం, జ్ఞానం, సంతానం మరియు వైవాహిక జీవితానికి కారకుడు. 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 కి గురువు కర్కాటక రాశిలోకి అడుగుపెడతారు. సాధారణంగా గురువుకు కర్కాటక రాశి అంటే అత్యంత ఇష్టం. ఇక్కడ ఆయన తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తారు. అక్టోబర్ 31, 2026 వరకు గురువు ఇదే రాశిలో ఉండి ప్రజల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తారు. మరి ఈ ఐదు నెలల కాలం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

కుటుంబంలో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగ...