భారతదేశం, జూన్ 17 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపీఓ (IPO) మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దాదాపు రూ. 33,000 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా రానున్న కొన్ని రోజుల్లోనే కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వార్షిక సాధారణ సమావేశం (AGM) ఈ వారం జూన్ 19, శుక్రవారం నాడు జరగనుంది. ఈ సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ చేసే ప్రసంగం కంటే ముందే ఈ ఐపీఓ ఫైలింగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది ఏజీఎం ప్రసంగంలోనే అంబానీ మాట్లాడుతూ.. జియో ఐపీఓ 2026 ప్రథమార్ధంలో (First Half) ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.

అంతర్...