భారతదేశం, ఆగస్టు 19 -- కేరళ అందాలను తిలకించాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కేరళ హిల్స్ & వాటర్స్(KERALA HILLS & WATERS) పేరిట ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో కేరళలోని ప్రముఖ కొండ ప్రాంతాలు, సుందరమైన బ్యాక్‌వాటర్స్, తేయాకు తోటలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మున్నార్, అలెప్పీ ప్రాంతాలను చూసి రావొచ్చు.

హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ టూర్ 5 రాత్రులు / 6 రోజులు. ఆగస్టు 25వ తేదీ నుంచి టూర్ మెుదలవుతుంది. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. నల్గొండ, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ట్రైన్ ఎక్కవచ్చు.

మెుదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 02:25 గంటలకు రైలు నెం. 20629 శబరి ఎక్...