భారతదేశం, మార్చి 9 -- సమ్మర్ ఎంట్రీ ఇవ్వటంతో చాలా మంది టూర్లు ప్లాన్ చేస్తుంటారు.! అయితే బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని మైసూర్, కూర్గ్ ప్రాంతాలను చూపించేందుకు ఓ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ. మార్చి 18వ తేదీన అందుబాటులో ఉంది.

'కాఫీ విత్ కర్ణాటక' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తక్కువ ధరలో కర్ణాటక అందాలను చూడొచ్చు. మార్చి 18వ తేదీన కుదరకపోతే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి. తేదీలను చెక్ చేసుకోవచ్చు. జర్నీ కంటే ముందుగానే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి.

కూర్గ్‌లో పచ్చని ప్రకృతి, కాఫీ తోటలు, జలపాతాలను చూడొచ్చు.మైసూర్ రాజభవనాలు, చందనంతో చేసిన కళాఖండాలకు ప్రసిద్ధి. ఈ రెండు ప్రాంతాలను కవర్ చేసేల...