భారతదేశం, ఫిబ్రవరి 27 -- Tirupati : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మార్చి 21-జూన్ 3 మధ్య 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్' పథకం కింద తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం నాలుగు ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీలను నిర్వహిస్తుందని ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ తెలిపారు.

ఈ రైళ్లు హైదరాబాద్/సికింద్రాబాద్ నుండి బయలుదేరి దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తాయని అశోక్ కుమార్ అన్నారు. ప్యాకేజీలలో రైలు ప్రయాణం, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనాలు, గైడెడ్ సైట్ సీయింగ్, అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ ఇన్సూరెన్స్ అందిస్తారు. రైల్వే స్టేషన్లు, దేవాలయాల మధ్య ప్రయాణాన్ని కూడా ప్యాకేజీలో భాగంగానే అందిస్తారు.

మార్చి 21-28, మే 24-31లో ఈ ప్యాకేజీ ఉంది. తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధుర...