భారతదేశం, ఏప్రిల్ 21 -- బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

తెలంగాణలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే, కేవలం మీ టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలుర, బాలికల కళాశాలల్లో మొత్తం 24,740 పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయని స...