భారతదేశం, మే 21 -- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇందిరమ్మ గృహ నిర్మాణ ఉత్సవం ప్రారంభమవుతుందని, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కోలం-కొఠారి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభిస్తారన్నారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభాస్థలి కోసం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాల ఇందిరమ్మ ఇండ్లలను పరిశీలించారు.

పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన...