భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. రాబోయే 2 - 3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(ఏప్రిల్ 25) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 26వ తేదీన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా.....