భారతదేశం, సెప్టెంబర్ 7 -- హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే 'జాయింట్ పాస్' విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

నగర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా రోజువారీ , నెలవారీ (Monthly) పాస్‌లు జారీ చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ (HMRL), టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగాల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి, రెండో విడత...