భారతదేశం, ఆగస్టు 13 -- మెట్రో రైలులో నిత్యం ప్రయాణించే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. నగరవాసులు ఎప్పటినుంచో ఆశిస్తున్న రోజువారీ, నెలవారీ పాస్‌ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ నిరాసక్తత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సామర్థ్యం ప్రకారం పాస్‌లు మంజూరు చేయడం ఏ రకంగానూ సాధ్యపడదని భావిస్తోంది. ప్రస్తుత లైన్‌లలో డైలీ, మంత్లీ పాస్‌ల జారీ అసాధ్యమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.

మరోవైపు త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు మెట్రో రెండో దశ ప్రతిపాదనలు రానున్నాయి. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమైన సమయం నుంచి సాధారణ ప్రయాణికులు పాస్‌ల సదుపాయం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత నెల చివర్లో నిర్వహించిన హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ బోర్డు సమావేశంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఛైర్మన్‌ సంజయ్‌ జాజు కూడా ...