Hyderabad Metro : అతిత్వరలో ప్రభుత్వం చేతికి మెట్రో.. డైరెక్టర్లుగా కీలక అధికారులు
భారతదేశం, ఏప్రిల్ 26 -- హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రూ.15,000 కోట్ల (అప్పులతో కలిపి) వ్యయంతో కొనుగోలు చేసే ప్రక్రియను అధికారికం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లావాదేవీ ఏప్రిల్ 30, 2026 నాటికి ముగింపు తేదీగా నిర్ణయించారు. స్వాధీనం అనంతరం ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ కోసం ప్రభుత్వం కొత్త డైరెక్టర్ల బోర్డును నామినేట్ చేసింది. ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఛైర్మన్గా నియమితులవ్వగా, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బోర్డులో డైరెక్టర్లుగా నియమితులైన ఇతర సభ్యులు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారిలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.