భారతదేశం, ఏప్రిల్ 7 -- ఓ వైపు వేసవి మెుదలైంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మెుదలైంది. ట్యాంకర్ల కూడా భారీగా డిమాండ్ ఉంది. జలమండలి కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. దూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ వాసులకు అందిస్తోంది. కొందరు మాత్రం నల్లాకు మోటర్లు బిగించి.. మిగతావారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా నీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చుకునే వినియోగదారులపై HMWSSB రూ.5,000 జరిమానా విధించనుంది.

తమకు నీటి సరఫరాను పెంచుకోవడానికి కుళాయి కనెక్షన్లపై మోటార్లను అక్రమంగా ఉపయోగించే వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ (HMWS&SB) తెలిపింది. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై పోలీసు చర్య కూడా తీసుకోవచ్చు.

'కొన్ని ప్రాంతాల నుంచి లో వాటర్ ప్రెజర్‌కు ...