భారతదేశం, ఏప్రిల్ 5 -- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. బుద్వెల్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలతో కొత్త హైకోర్టు సముదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన భవన నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు.

రాష్ట్రంలో న్యాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయవ్యవస్థ పనితీరు కోసం అత్యాధునిక సౌకర్యాలను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు వెల్లడించార...