భారతదేశం, ఆగస్టు 19 -- Hyderabad Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సంజీవయ్య పార్క్‌లో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) సిద్ధమైంది. పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్‌లను అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో సుమారు రూ. 49.65 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందిస్తూ, నగర పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

కన్నుల పండువగా సాగే ఈ మల్టీమీడియా షోలో అద్భుతమైన లేజర్ ప్రొజెక్షన్లు, నీటి తెరలపై (వాటర్ స్క్రీన్) కనిపించే మనోహరమైన దృశ్...