భారతదేశం, జూన్ 19 -- హైదరాబాద్ నగరంలో నకిలీ, కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై పోలీసులు, ఆహార భద్రతా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘా ఉంచిన హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) తాజాగా చార్మినార్ పరిధిలో మరో భారీ అక్రమ కేంద్రాన్ని బట్టబయలు చేసింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి హెచ్-ఫాస్ట్ బృందం హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ తయారీ కేంద్రం, గోదాముపై మెరుపు దాడి నిర్వహించింది.

విశ్వసనీయ సమాచారం అందుకున్న అధికారులు చార్మినార్ పరిధిలోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్ ప్రాంతంలో ఉన్న 'మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్' ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు అధికారులను సైతం...