భారతదేశం, ఆగస్టు 27 -- హైదరాబాద్‌లోని ప్రముఖ పిస్తా హౌస్ అవుట్‌లెట్ వ్యాలెట్ పార్కింగ్ వద్ద ఒక వ్యక్తి కారును ఎత్తుకెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక పాత నేరస్థుడు, కర్ణాటకలోని తన తండ్రి సమాధిని దర్శించుకోవడానికి డబ్బులు లేక ఈ కారు చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టు అయిన నిందితుడిని రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న 30 ఏళ్ల సయ్యద్ మజర్ గా గుర్తించారు. మజర్ సాధారణ వ్యక్తి కాదు, అతడు ఒక అలవాటుపడిన పాత నేరస్థుడు. గతంలో అనేక ఆస్తి సంబంధిత నేరాలు,హింసాత్మక నేరాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అతడు పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. గుడిమల్కాపూర్, లంగర్ హౌస్, సనాత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయి. 2024లో అరెస్ట్ అయిన అతడు సంగారెడ్డిలోని కంది జైలుకు రిమాండ్ ఖైదీగా కూడా వెళ్...