భారతదేశం, మార్చి 11 -- మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించనున్న 2027 జనాభా లెక్కల గృహ జాబితా దశకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి డిజిటల్‌ జనాభా లెక్కలు జరగనున్నాయి. మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ మెుదలవుతుంది. అధికారిక గుర్తింపు సంఖ్యలు లేని ఇళ్లకు ప్రత్యేక సంఖ్యలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించింది.

కొత్త నిర్మాణాలు, తాత్కాలిక నివాసాలు, గ్రామీణ గృహాలు సహా అన్ని నివాస నిర్మాణాలు గృహ జాబితాలో చేర్చినట్టుగా నిర్ధారించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు జనాభా గణన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. యాజమాన్యం లేదా ఏదైనా చట్టపరమైన హక్కులను ఇవ్వవని ఇంటి యజమానులకు తెలియజేయాలని కూడా అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అవే శాశ్వత ఇంటి నెంబర్లు అనుకోవద్దు....