భారతదేశం, మార్చి 3 -- ప్రస్తుతం ప్రపంచం మరో యుద్ధం ముంగిట నిలుచుంది. అమెరికా-ఇరాన్ మధ్య రేగిన చిచ్చు మధ్యప్రాచ్యం (Middle East) అంతటా ఉద్రిక్తతలను పెంచింది. ఫిబ్రవరి 28న ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు ఈ ఘర్షణను మరింత తీవ్రం చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి.

యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ నర్గిస్ ఫక్రీ, సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా ప్రస్తుతం దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ప్ర...