భారతదేశం, ఏప్రిల్ 29 -- GRSE q4 results 2026: భారత స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ రంగ షేర్ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్' (GRSE) బుధవారం దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2026 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి కంపెనీ ప్రకటించిన అద్భుతమైన ఫలితాలే ఇందుకు ప్రధాన కారణం.

మంగళవారం రూ. 2,875.30 వద్ద ముగిసిన జీఆర్‌ఎస్‌ఈ షేరు, బుధవారం ఉదయం ఏకంగా రూ. 3,100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫలితాల జోష్‌తో కొనుగోళ్ల వెల్లువ కొనసాగడంతో ఒక దశలో ఈ స్టాక్ 15 శాతం పెరిగి రూ. 3,339 గరిష్ట స్థాయిని తాకింది. గత కొంతకాలంగా రక్షణ రంగ షేర్లలో ఉన్న బుల్లిష్ ట్రెండ్‌కు ఈ ఫలితాలు మరింత ఊతమిచ్చాయి.

జీఆర్‌ఎస్‌ఈ నెట్ ప్రాఫిట్ గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ...