భారతదేశం, జూలై 15 -- అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. బుధవారం ఉదయం 9:10 గంటల సమయానికి దేశీయ రిటైల్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 0.57% (రూ. 820) క్షీణించి Rs.142,170 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, కిలో వెండి ధర కూడా 0.47% తగ్గి Rs.222,620 వద్ద కొనసాగుతోంది.

గత సెషన్‌లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంచవచ్చనే (Hawkish outlook) అంచనాల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించడం వల్ల చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. చర్చలకు రాకుంటే వచ్చే వారం ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చ...