భారతదేశం, జూన్ 8 -- యూఎస్-ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. చమురు ధరలు పైపైకి దూసుకుపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని ప్రభావం పసిడి, వెండి మార్కెట్లపై తీవ్రంగా పడింది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అటు బంగారం, ఇటు వెండి ధరలు ఒత్తిడికి లోనై భారీగా పతనమయ్యాయి.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం బంగారం ధరలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ గంటల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,177 వద్ద ఓపెన్ అయి, కొద్ది నిమిషాల వ్యవధిలోనే రూ. 1,53,596 ల ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది.

మరోవైపు వెండి ధర ప్రారంభంలో కొంత సానుకూలంగా కిలో రూ. 2,51,001 వద్ద ముందడుగు వేసినప్పటికీ, మార్కెట్ ఒత్తిడి తట్టుకోలేకపోయింది. ఉదయపు ట్రేడింగ్‌లోనే...