భారతదేశం, ఆగస్టు 3 -- గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో దిగువ ప్రాంతాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఆదివారం రాత్రి నాటికి ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ నుంచి 14.13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కాస్త తగ్గినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు మరియు నదీ పరివాహక ప్రాంతవాసులు వరద నీరు పూర్తిగా తగ్గే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.

మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశ...