భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలంగాణలో వేసవిలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉంటున్న నేపథ్యంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్(TGPWU) గిగ్ వర్కర్ల కోసం #GlassOfWaterCampaignను ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ, కిరాణా డెలివరీ, రవాణా వంటి సేవలను అందిస్తూ, అధిక ఉష్ణోగ్రతలలో ఆరుబయట నిరంతరం పనిచేస్తున్న డెలివరీ కార్మికులు, క్యాబ్ డ్రైవర్ల పని గురించి గుర్తు చేసింది. దీంతో ఈ క్యాంపెయిన్ మెుదలుపెట్టింది.

వేడిని తట్టుకోవడంలో వారికి సహాయపడేలా.. గిగ్ వర్కర్లకు ఒక గ్లాసు నీళ్లు అందించాలని TGPWU ప్రజలకు కోరింది. 'బయట 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు.. రోజంతా ఆ ఎండలో నిలబడి మీకు ఆహారాన్ని అందించడం లేదా మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు. వారు పెద్దగా ఏమీ అడగరు. కేవలం గౌరవం, అప్పుడప్పుడు ఒక గ్లా...