భారతదేశం, ఏప్రిల్ 5 -- తిరుమలలోని శ్రీవారి గరుడ వాహన సేవ 2026 సంవత్సరంలో జరిగే తేదీలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఏయే తేదీల్లో వాహన సేవ జరుగుతుందో తెలిపింది. అలాగే రద్దు చేసిన తేదీలు, కారణాలు కూడా వెల్లడించింది.

తిరుపతి జిల్లా నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి పూజ, అంకురార్పణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన...