భారతదేశం, మార్చి 7 -- సినీ నటీనటుల్లో ఉత్సాహం నింపేందుకు ఇచ్చే పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తెలుగు సినీ తారలను నంది అవార్డ్స్‌తో సత్కరించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీలకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇచ్చేందుకు పూనుకుంది రాష్ట్ర సర్కార్.

ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (మార్చి 7) 2025 సంవత్సరానికి గానూ గద్దర్ అవార్డ్స్‌ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, గతేడాదికి సంబంధించిన స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌ను ఈ అవార్డులకు సెలెక్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం'ను అందించనున్న...