భారతదేశం, సెప్టెంబర్ 20 -- SCR Festival Special Trains : రాబోయే పండుగల సీజన్‌లో సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి మరియు తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

పండుగ సమయంలో పెరిగే ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రయాణం సౌకర్యవంతంగా సాగేలా చేయడానికి ఇరు మార్గాల్లో చెరో 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 25 వరకు పట్టాలెక్కనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ ఇరువైపులా పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెన...