భారతదేశం, మార్చి 10 -- ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(APSPDCL) తన అధికార పరిధిలోని 162 ప్రదేశాలలో ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 13 kW లైట్ ఈవీ ఏసీ/డీసీ ఛార్జర్‌లతో కూడిన ఛార్జింగ్ స్టేషన్‌లను పీఎం-ఈ ​​డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోథేటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ మొబిలిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ PM-KUSUM 2.0 పథకం కింద ఫీడర్-స్థాయి సోలరైజేషన్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. 2026-27 నుండి 2029-30 వరకు ఏటా 550 ఎండబ్ల్యూ సౌ...