భారతదేశం, మే 20 -- కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు.

యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయానికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు (Testing) విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వస్తే, సభ్యులు తమ ఖాతాలోని నిధులను కేవలం యూపీఐ పిన్ నమోదు చేయడం ద్వారా సెక్యూర్డ్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన నగదును నేరుగా డిజిటల్ చెల్లింపులకైనా వాడుకోవచ్చు లేదా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ కొత్త విధ...