భారతదేశం, మే 4 -- పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ- టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అదే సమయంలో భబనిపూర్​ నియోగకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువెందు అధికారి లీడింగ్​లో ఉన్నారు.

తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్.. ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు.. కేరళలో యూడీఎఫ్, ఎల్​డీఎఫ్​ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రెండూ చరో 34 చోట్ల లీడింగ్​లో ఉన్నాయి. ఎన్డీఏ 3 స్థానాల్లో ముందుంది.

8 గంటల 15 నిమిషాల వరకు ఉన్న ఎర్లీ ట్రెండ్స్​ ప్రకారం.. పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ 0 చోట్ల, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్​లో ఉన్నాయి.

తమిళనాడులో డీఎంకే 4 స్థానాల్లో, అన్నాడీఎంకే 2 చోట్ల, విజయ్​ టీవీకే 1 సీటులో లీడింగ్​లో ఉన్నాయి.

కేరళలో యూడీఎఫ్​ దూసుకెళుతోంది! 9 చోట్ల ఆధిక్యంలో ఉం...