భారతదేశం, జూలై 16 -- దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల కారు ఇంజన్ పదేపదే ఆగిపోతోందని దాఖలైన ఫిర్యాదును విచారించిన రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (అదనపు బెంచ్) కస్టమర్‌కు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం ఇంధన స్వయంసమృద్ధి కోసం పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచుతున్న నేపథ్యంలో, వాహనాల ఇంజన్ సామర్థ్యం, మైలేజీపై వస్తున్న సవాళ్లపై దేశంలో వెలువడిన మొదటి కోర్టు తీర్పుగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.

రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవతా 2023 మోడల్‌కు చెందిన 'మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా ప్లస్' (Maruti Grand Vitara Strong Hybrid Ze...