భారతదేశం, జూన్ 24 -- వాహనదారుల్లో గందరగోళం సృష్టిస్తున్న E20 పెట్రోల్ (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్) ఇన్సూరెన్స్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం గట్టి క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చెల్లకుండా పోతాయనే ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది.

"ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విధానం. అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి పలు దేశాల్లో ఇది ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది" అని మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

సోషల్ మీడియాలో పెట్రోల్‌లో నేరుగా చెరకు రసాన్ని కలుపుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసిస్, నూకలు (విరిగిన బియ్యం), మొక్కజొన...