భారతదేశం, జూన్ 15 -- భారతదేశ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ స్పృహ ఉన్న వాహనదారులందరూ గమనించాల్సిన రోజులివి. 2026 నాటికి దేశవ్యాప్తంగా 'E20' పెట్రోల్ ప్రామాణిక వేరియంట్‌గా మారిపోయింది. సాధారణ పెట్రోల్ లేదా E10 ఇంధనం లభించడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారింది.

E20 అంటే 20 శాతం ఇథనాల్ (Ethanol), 80 శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న లాంటి సహజ వనరుల నుండి తయారయ్యే ఒక జీవ ఇంధనం (Biofuel). దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికర వాయువుల విడుదల తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. దేశీయ రైతులకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటుంది. అయితే, ఈ కొత్త ఇంధనం మీ కారుకు సరిపోతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

భారతీయ ఆటోమొబైల్ రంగం ఏప్రిల్ 2023 నుండి ఒక పెద్ద మార్పును చేపట్టింది. మీ కారు ఈ ఇంధనా...