భారతదేశం, మే 1 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన'ధురంధర్' సినిమా కాపీ వివాదంలో దర్శకుడు ఆదిత్య ధర్ మొదటి విజయం అందుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ బెంగళూరుకు చెందిన స్క్రీన్ రైటర్ సంతోష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

తన 'డి-సాహెబ్' అనే స్క్రిప్ట్‌ను దొంగిలించి ధురంధర్ సినిమా తీశారని సంతోష్ ఆరోపించారు. అయితే, జస్టిస్ కె.ఎస్. హేమలేఖ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఫిర్యాదులో ఎలాంటి పస లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనపై నష్టపరిహారం కోరుతూ సంతోష్ వేసిన మరో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

మరోవైపు, ఆదిత్య ధర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో సంతోష్ కుమార్ వెనక్కి తగ్గారు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నంత వరకు ఆదిత్య ధర్‌పై ఎలాంట...