భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం (మార్చి 23) సాధారణంగా వసూళ్లలో తగ్గుదల కనిపించడం సహజం.

అయితే, ధురంధర్ 2 మాత్రం ఆ ప్రభావాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. ఐదు రోజులు ముగిసేసరికి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

విడుదలైన ఐదో రోజు (మొదటి సోమవారం) ధురంధర్ 2 చిత్రం ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆదివారం (మార్చి 22) నాటి రూ. 114.85 కోట్లతో పోలిస్తే ఇది 43.4 శాతం తగ్గుదల అయినప్పటికీ, వర్కింగ్ డే కావడంతో ఈ వసూళ్లు అత్యంత భారీగా పరిగణించవచ్చు.

దేశవ్యాప్...